కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ

0
128

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో  చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అన్నారు. దోబీ ఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి కంటోన్మెంట్ నుండి లేఖ రాయడంపై జాప్యం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అభివృద్ధి పనుల విషయంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసి విధానాన్ని సడలించాలని కోరారు. తిరుమలగిరి చెరువు, బోయిన్ పల్లి రామన్న కుంట చెరువుల సుందరీ కరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పాలనాపరమైన అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఈవో ను కోరారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు కు వచ్చే 303.62 కోట్ల రూపాయల నిధులకు ఎన్ఓసి మంజూరు చేయాలని కూడా  సీఈఓ ను కోరడం జరిగింది.

Search
Categories
Read More
BMA
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age In today’s...
By BMA (Bharat Media Association) 2025-05-28 06:20:42 0 1K
Telangana
ప్రారంభోత్సవ కార్యక్రమం
140 డివిజన్ నుండి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-07 08:59:39 0 782
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 535
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 231
Telangana
భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.
17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది...
By Sidhu Maroju 2025-07-02 13:21:52 0 300
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com