Journalist
  • 31 Posts
  • 23 Photos
  • 1 Videos
  • Journalist at Alwal
  • Studied Sp. College at Gurukul English Medium School
    Class of B.A. JMC
  • Followed by 3 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Telugu
Work Info
  • Currently Working For
    Journalist
  • Current Position
    Journalist
Location Info
  • State
    Telangana
  • Constituency
    Malkajgiri
  • District
    Medchal malkajgiri
  • Mandal | Tahasil | Sub Division
    Mandal alwal.
Search
Recent Updates
  • అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
    అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 17 Views 0 Reviews
  • ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
    అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో...
    0 Comments 0 Shares 28 Views 0 Reviews
  • ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి
    పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
    Love
    1
    0 Comments 0 Shares 19 Views 0 Reviews
  • అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులు
    సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ లేడిని వారసి గూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డిసిపి నరసయ్య తెలిపారు. ఆల్వాల్ మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీద విజయా అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల...
    0 Comments 0 Shares 110 Views 0 Reviews
  • ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
     మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో సమావేశమయ్యారు. అల్వాల్ BHEL కాలనీ, వెంకటాపురం, బోలారం, సఫిల్‌గూడ, వినాయకనగర్ తదితర ప్రాంతాలలో మంజూరైన ROB/RUBలకు తక్కువ సమయంలో భూమిపూజ ఉంటుందని చెప్పారు.
    0 Comments 0 Shares 111 Views 0 Reviews
  • జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
    కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు   ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పర ప్రసాద్  పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం...
    0 Comments 0 Shares 139 Views 0 Reviews
  • జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ.

    జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
    ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.
    నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి.
    ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ...
    “జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు.
    ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ. జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ... “జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
  • మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి.
    --బత్తిని గౌరీశంకర్ గౌడ్.

    జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.
    మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి. --బత్తిని గౌరీశంకర్ గౌడ్. జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.
    0 Comments 0 Shares 155 Views 55 0 Reviews
  • "దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం

    ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం.

    పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు.
    దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు.
    "దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం. పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు.
    Love
    2
    3 Comments 0 Shares 425 Views 0 Reviews
  • ప్రమాదాల నివారణ చర్యలు.
    లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు.

    రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు
    గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి.
    అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి.
    అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    ప్రమాదాల నివారణ చర్యలు. లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు. రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి. అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    Like
    1
    0 Comments 0 Shares 174 Views 0 Reviews
  • విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం.

    ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి.

    అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు.

    డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.

    తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు.

    వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు.
    విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం. ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి. అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు. డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు. తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు. వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు.
    Love
    1
    0 Comments 0 Shares 428 Views 0 Reviews
  • సి.సి. రోడ్డుపనులు ప్రారంభించిన కార్పోరేటర్.

    ఈ రోజు అల్వాల్ వెంకటాపురంలో ₹14 లక్షల రూపాయలతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాల మేరకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ప్రారంభోత్సవం చేసారు.
    ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రకాష్ గౌడ్, జంధార్, జె.డి.నర్సింగ్, ఫరీద్,రాజేందర్, విజయశేఖర్, మోసిన్, మురళి గౌడ్, బాస్కర్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    సి.సి. రోడ్డుపనులు ప్రారంభించిన కార్పోరేటర్. ఈ రోజు అల్వాల్ వెంకటాపురంలో ₹14 లక్షల రూపాయలతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాల మేరకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ప్రారంభోత్సవం చేసారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రకాష్ గౌడ్, జంధార్, జె.డి.నర్సింగ్, ఫరీద్,రాజేందర్, విజయశేఖర్, మోసిన్, మురళి గౌడ్, బాస్కర్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    Like
    1
    0 Comments 0 Shares 196 Views 0 Reviews
  • స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, సహకరించిన ఎమ్మెల్యేకు సన్మానం.

    కంటోన్మెంట్ లోని ధోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్ల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని కంటోన్మెంట్ లోని క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో పలుమార్లు సమన్వయం చేయడం వలన నిధులు సాధించుకోగలిగామని, రాష్ట్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ బోర్డు కు మధ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంవోయు కూడా కుదిరిందని ఎమ్మెల్యే తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.
    స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, సహకరించిన ఎమ్మెల్యేకు సన్మానం. కంటోన్మెంట్ లోని ధోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్ల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని కంటోన్మెంట్ లోని క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో పలుమార్లు సమన్వయం చేయడం వలన నిధులు సాధించుకోగలిగామని, రాష్ట్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ బోర్డు కు మధ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంవోయు కూడా కుదిరిందని ఎమ్మెల్యే తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.
    Like
    1
    0 Comments 0 Shares 472 Views 0 Reviews
  • డంపింగ్ యార్డ్ తొలగించండి.
    సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష.

    మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
    డంపింగ్ యార్డ్ తొలగించండి. సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష. మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
    0 Comments 0 Shares 231 Views 0 Reviews
  • "ఇందిరా మహిళాశక్తి పథకం" పై మహిళలకు అవగాహన కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.

    కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో మోప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు మరియు మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
    రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా కంటోన్మెంట్ మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు బ్యాంకు అధికారులు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను, వినియోగించుకునే విధానాన్ని మహిళా సంఘాల సభ్యులకు వివరించారు.
    రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే విజయం సాధించవచ్చని, సలహాలు, సూచనలు అందించడానికి అధికారులతో పాటు తను కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. తను కూడా వ్యాపారం చేసి విజయం సాధించానని వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. తను స్వయంగా కూడా సలహాలు సూచనలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
    ఆలోచనలు ఎప్పుడూ పెద్ద స్ధాయిలో ఉండాలని, దానికి తగ్గటు పట్టుదల కృషి ఉంటే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి ఎమ్మెల్యే అన్ని విధాల సహకారం అందిస్తాను అని హామి ఇచ్చారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుటుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల అభివృద్దికి , సాధికారితకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
    గతంలోని ఇక్కడి నాయకులకు, కంటోన్మెంట్ బోర్డు కు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేక నిధులు తీసుకురావకపోవడంతో అభివృద్ది వెనకబడిపోయిందని కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తాను నిరంతరం ముఖ్యమంత్రి తో, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కంటోన్మెంట్ కు నిధులు తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు.
    ఈ కార్యక్రమంలో మోప్మా పట్టణ మిషన్ కోఆర్టినేటర్ ప్రకాశ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్టినేటర్ నర్సింహులు, ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు నాయక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునంద తో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    "ఇందిరా మహిళాశక్తి పథకం" పై మహిళలకు అవగాహన కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో మోప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు మరియు మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా కంటోన్మెంట్ మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు బ్యాంకు అధికారులు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను, వినియోగించుకునే విధానాన్ని మహిళా సంఘాల సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే విజయం సాధించవచ్చని, సలహాలు, సూచనలు అందించడానికి అధికారులతో పాటు తను కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. తను కూడా వ్యాపారం చేసి విజయం సాధించానని వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. తను స్వయంగా కూడా సలహాలు సూచనలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఆలోచనలు ఎప్పుడూ పెద్ద స్ధాయిలో ఉండాలని, దానికి తగ్గటు పట్టుదల కృషి ఉంటే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి ఎమ్మెల్యే అన్ని విధాల సహకారం అందిస్తాను అని హామి ఇచ్చారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుటుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల అభివృద్దికి , సాధికారితకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలోని ఇక్కడి నాయకులకు, కంటోన్మెంట్ బోర్డు కు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేక నిధులు తీసుకురావకపోవడంతో అభివృద్ది వెనకబడిపోయిందని కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తాను నిరంతరం ముఖ్యమంత్రి తో, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కంటోన్మెంట్ కు నిధులు తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మోప్మా పట్టణ మిషన్ కోఆర్టినేటర్ ప్రకాశ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్టినేటర్ నర్సింహులు, ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు నాయక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునంద తో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 592 Views 0 Reviews
  • అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

    అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడలో ఘటన. అల్లనేరేడు పండ్ల కోసం చెట్టెక్కి పండ్లు కోస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి కింద పడి మృతి చెందిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం. పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోసం ఎవరు రానందున గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు. మృతుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
    అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడలో ఘటన. అల్లనేరేడు పండ్ల కోసం చెట్టెక్కి పండ్లు కోస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి కింద పడి మృతి చెందిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం. పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోసం ఎవరు రానందున గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు. మృతుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
    0 Comments 0 Shares 224 Views 0 Reviews
  • అల్వాల్ డివిజన్ ఇందిరా నగర్ లో నాలా పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్.

    అల్వాల్ డివిజన్ ఇందిరానగర్ లో జరుగుతున్న నాలా దగ్గర కొనసాగుతున్న పనులను ఏ.ఈ. అరుణ్ తో కలిసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
    వర్షాకాలంలో నీటి ప్రవాహం సాఫీగా సాగడానికి సిల్ట్ అడ్డంకులను పూర్తిగా తొలగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, నగిరి, సాజిద్,అరుణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
    అల్వాల్ డివిజన్ ఇందిరా నగర్ లో నాలా పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్. అల్వాల్ డివిజన్ ఇందిరానగర్ లో జరుగుతున్న నాలా దగ్గర కొనసాగుతున్న పనులను ఏ.ఈ. అరుణ్ తో కలిసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం సాఫీగా సాగడానికి సిల్ట్ అడ్డంకులను పూర్తిగా తొలగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, నగిరి, సాజిద్,అరుణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 246 Views 0 Reviews
  • కేశవ నగర్ లో బోరెవెల్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్.

    ఓల్డ్ నేరెడీమేట్ లోని కేశవ నగర్ లో ఇటీవల పాదయాత్ర చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కు స్థానిక మహిళలు బోర్వెల్ మరమ్మత్తులు చెప్పట్టాలని కోరగా, ఈ రోజు ఆ మేరకు బోర్వెల్ మరమ్మత్తులను చెప్పట్టడం జరిగింది.

    వర్షం ఉండటం తో స్థానిక బీజేపీ నాయకులు అంజయ్య, పవన్, అమర్, నందు యాదవ్, మురళి గౌడ్, సునీల్ తదితరులతో కలిసి వాటర్ వర్క్స్ సిబ్బందికి సహకరించి బోర్వెల్ మరమ్మత్తు పూర్తి చెయ్యడం జరిగింది.

    ఈ సందర్బంగా మరో రెండు బోర్లు సైతం చేయ్యాలని కోరగా... తప్పకుండ చేయిస్తానని వెంటనే.. కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
    కేశవ నగర్ లో బోరెవెల్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఓల్డ్ నేరెడీమేట్ లోని కేశవ నగర్ లో ఇటీవల పాదయాత్ర చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కు స్థానిక మహిళలు బోర్వెల్ మరమ్మత్తులు చెప్పట్టాలని కోరగా, ఈ రోజు ఆ మేరకు బోర్వెల్ మరమ్మత్తులను చెప్పట్టడం జరిగింది. వర్షం ఉండటం తో స్థానిక బీజేపీ నాయకులు అంజయ్య, పవన్, అమర్, నందు యాదవ్, మురళి గౌడ్, సునీల్ తదితరులతో కలిసి వాటర్ వర్క్స్ సిబ్బందికి సహకరించి బోర్వెల్ మరమ్మత్తు పూర్తి చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా మరో రెండు బోర్లు సైతం చేయ్యాలని కోరగా... తప్పకుండ చేయిస్తానని వెంటనే.. కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
    0 Comments 0 Shares 710 Views 0 Reviews
More Stories
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com