నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల

0
832

సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉప సంఘం లో తనతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని వారికి అన్ని వాస్తవాలు తెలుసని అన్నారు.బనకచర్ల పై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లో కొట్లాడిందే తానని తెలిపారు.కాలేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని,రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు.వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజాపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాలేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జల యజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈనెల 22 న 11 సంవత్సరాల భాజాప పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

 

 

Search
Categories
Read More
Telangana
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.
  కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా...
By Sidhu Maroju 2025-07-10 09:25:29 0 622
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 1K
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 393
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 775
Punjab
Punjab’s Big Push for Early Childhood Development: 1,419 New Anganwadi Centres, Tech Integration, and More
Chandigarh:  The Punjab government, under the leadership of Chief Minister Bhagwant Singh...
By BMA ADMIN 2025-05-20 08:10:58 0 1K
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com