నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

0
720

డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో హ్యాట్రిక్ విజయంతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కెపి.వివేకానంద్ గారిని సన్మానిస్తూ "సన్మాన సభ" ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారిని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు మాట్లాడుతూ....గత రెండు పర్యాయాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునః నిర్మాణ పనులకు ముందుకు వచ్చి తమ తోడ్పాటునందిస్తున్న దాతలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కరింపచేశారు.ఈ కార్యక్రమంలో ఎం. ఎన్. రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు టెంపుల్ కమిటీ చైర్మన్ ఎస్. గోవర్ధన్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి భరత్, దేవాలయ ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి, కోశాధికారి రాము, కాలనీవాసులు లక్ష్మీ మోహన్, మోహన్ రావు, సంజీవరావు, చంద్రారెడ్డి, హరికృష్ణ, కిరణ్ కుమార్, బాల శ్రీనివాసమూర్తి, చంద్రశేఖర్, నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, కాలే నాగేష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, సంపత్ గౌడ్, బాల మల్లేష్, ఆటో బలరాం, విజయ్ హరీష్, మహిళా నాయకురాలు ఇంద్రా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Media Academy
Research Skills: Digging Deeper for the Truth
Research Skills: Digging Deeper for the Truth A journalist’s job is to go beyond...
By Media Academy 2025-04-29 07:49:05 0 2K
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 689
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:45:12 0 747
Telangana
రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్...
By Sidhu Maroju 2025-07-12 17:38:23 0 487
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 1K
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com