జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,

0
772

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం వల్లే తల్లికి వందనం పథకం అమలు చేశారని వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. జగన్ కూటమి సర్కారుపై ఒత్తిడి తేవకపోతే తల్లికి వందనం పథకం పూర్తిగా నీరుగారి పోయేదని ఆయన వెల్లడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూనే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను గురుతరంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటేనే వైయస్ కుటుంబమని దేశవ్యాప్తంగా పేరు ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అన్నది ప్రజలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన గుర్తు చేశారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సంక్షేమ పథకాల దూకుడును కొనసాగించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమ పథకాలను గోతిపెడతారని ప్రతిసారి రుజువైందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ఊపిరిగా బతికినా కుటుంబం వైయస్ జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ పథకాలు స్థిరంగా ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునుముందు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అండగా జగన్ ఉన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
   సికింద్రాబాద్/ కంటోన్మెంట్.   కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
By Sidhu Maroju 2025-08-03 16:31:59 0 49
Entertainment
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad South superstar Suriya is on...
By BMA ADMIN 2025-05-21 13:27:38 0 1K
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 697
Andhra Pradesh
గూడూరు జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల‌కు యూనిఫార్మ్స్ , బ్యాగుల పంపిణీ
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీకి చెందిన జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో...
By mahaboob basha 2025-06-13 13:14:08 0 863
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 161
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com