జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,

0
107

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం వల్లే తల్లికి వందనం పథకం అమలు చేశారని వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. జగన్ కూటమి సర్కారుపై ఒత్తిడి తేవకపోతే తల్లికి వందనం పథకం పూర్తిగా నీరుగారి పోయేదని ఆయన వెల్లడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూనే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను గురుతరంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటేనే వైయస్ కుటుంబమని దేశవ్యాప్తంగా పేరు ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అన్నది ప్రజలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన గుర్తు చేశారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సంక్షేమ పథకాల దూకుడును కొనసాగించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమ పథకాలను గోతిపెడతారని ప్రతిసారి రుజువైందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ఊపిరిగా బతికినా కుటుంబం వైయస్ జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ పథకాలు స్థిరంగా ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునుముందు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అండగా జగన్ ఉన్నారని తెలిపారు.

Search
Categories
Read More
BMA
BMA: Your Gateway to the Biggest Stages in Media 🌎🎙
BMA: Your Gateway to the Biggest Stages in Media 🌎🎙️ At Bharat Media Association (BMA), we...
By BMA (Bharat Media Association) 2025-04-28 06:06:02 0 820
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 914
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 195
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 11:05:54 0 688
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 361
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com