రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి

0
252

కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఐ మండల కార్యదర్శి బి.రాజుఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు రాజు రాముడు డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులో తాసిల్దార్ వెంకటేష్ నాయక్ కు ఏపీ రైతు సంఘం తరఫున సిపిఐ మండల కార్యదర్శి బి రాజు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన కూడా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా పే ఆఫ్ స్కేల్ ఫైనాన్స్ కింద పంట రుణాలను ఐదు లక్షలకు పెంచాలి. గ్రామసభలు నిర్వహించి భూ యజమానుల ప్రమేయం లేకుండా కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేయాలి. కౌలు రైతులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా 2 లక్షల వ్యవసాయ పంట రుణాలను ఎలాంటి పూచి కతూ లేకుండా ఇవ్వాలి. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు ప్రధాన కాలువలు చెరువులను మరమ్మత్తులు చేపట్టి వ్యవసాయ అనుగుణంగా తక్షణ పనులు చేపట్టాలి. వరి పంటకు పక్క రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో కూడా క్వింటాలకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేస్తున్నాం. పామాయిల్ దిగుమతి పై సుoఖాన్ని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం పునః సంక్షించాలి. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్చేసిన వ్యవసాయ పనుల కనుగుణంగా అమలు చేయాలి. సబ్సిడీ కింద రైతులకు వ్యవసాయ పరికరాలను విరివిగా అందించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దిలేటి,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి, రైతులు కౌలుట్ల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work New...
By BMA ADMIN 2025-05-20 06:25:45 0 465
Telangana
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla Rajanna-Sircilla: A...
By BMA ADMIN 2025-05-19 17:20:47 0 423
Haryana
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25 Chandigarh...
By BMA ADMIN 2025-05-22 11:43:50 0 477
BMA
Bharat Media Association (BMA)!!!!
Heart of Every Story, Behind Every Headline, and within every Frame – the dedication of...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:05:03 0 1K
Telangana
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై...
By Sidhu Maroju 2025-06-13 14:25:20 0 129
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com