గూడూరు ): అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని

0
69

అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కోడుమూరు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం గూడూరులో కోడుమూరు నియోజక వర్గ స్థాయి అన్నదాత సుఖీభవ - పియం కిసాన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ బి. నవ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. సూపర్సెక్స్ పధకాలలో భాగంగా అన్నదాత సుకీభవ పథకం కింద రైతులకు సంవత్సరా నికి రూ.20వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడును, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి. నవ్య మాట్లాడుతూ రైతుల స్థిర ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్ విండో అధ్యక్షుడు బి దానమయ్య, డైరెక్టర్ రేవట వెంకటేష్, టీడీపీ నాయకుడు సృజన్, కౌన్సిలర్లు కోడుమూరు షాషావళి, బుడ్డంగలి, టీడీపీ నాయకులు పౌలు, తెలుగు శ్రీను, నాగప్పయాదవ్, చాంద్ బాష, సుమన్బాబు, ఏడీఏ సాలు రెడ్డి, ఏవొలు దస్తగిరి రెడ్డి, మల్లేష్ యాదవ్, రవి ప్రకాష్, రూఫస్ రోనాల్, శ్రీవరన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
By Bharat Aawaz 2025-06-25 17:46:56 0 543
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 345
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 580
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 690
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 512
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com