కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు

0
178

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.  

బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది ప్రధానంగా మహంకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. బోనాల పండుగలో ఘటం ఊరేగింపు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రత్యేమైన కలశం. దీనిని వూరేగింపుగా అమ్మవారి వద్దకు తీసుకెళతారు. ఈ వూరేగింపుతో మొదటి రోజు బోనాల సమర్పణ ద్వారా ముగుస్తుంది. మరుసటి రోజున రగం అనే కార్యక్రమం జరుగుతుంది.ఒక స్త్రీ మహంకాళి దేవతను తనపైకి ఆహ్వానించి భవిష్యవాణి చెపుతుంది. పోతరాజు అమ్మవార్లకు తమ్ముడు అంటారు. అతను ఈ పండుగలో ఆనందంగా ప్రతేక ఆకర్షణగా నిలుస్తాడు. ఈ పండుగలోఅనేక ఇతర సాంప్రదాయాలు..ఒగ్గు కథ, పాలబండి, గుర్రపు బగ్గి, పోతరాజు విన్యాసాలు భక్తులలో భక్తి పారవస్యాలు నింపుతాయి. ఈ పండుగను పురస్కరించుకొని కౌకూరులో జరిగిన బోనాల పండగ కార్యక్రమానికి ఆల్వాల్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు వుంటాయని అయన తెలియచేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి, పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  జెకె కాలనీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం యాదవ్, సర్వేష్ యాదవ్, దిండ్లస్వామి, వి.వి.రావు, దేవేందర్,  స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Bharat Aawaz
Bharat Aawaz!  THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:45:11 0 460
Andhra Pradesh
కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్...
By mahaboob basha 2025-05-30 10:06:50 0 967
Chandigarh
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...
By Bharat Aawaz 2025-07-17 05:59:21 0 197
Andhra Pradesh
స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది
తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22....
By mahaboob basha 2025-07-27 05:32:31 0 15
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 452
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com