ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.

0
61

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చెయ్యాలని నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు గోడపత్రికను విడుదల చెయ్యడం జరిగింది. సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్,సిపిఐ ఎమ్ ఎల్ నాయకులు అనురాధ,శివబాబు, మాస్ లైన్ కార్యదర్శి ప్రవీణ్,సిపిఎం నాయకులు అంజయ్య,సత్యం, స్వాతి లు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మావోయిస్టు లను ఏరివేత పేరుతో చంపుతాం అని బహిరంగాగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడమే నని, చర్చలు జరుపడానికి సిద్ధం అని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమాని,ఇతర దేశాలతో చర్చలు జరుపడానికి సిద్దమైన ప్రభుత్వం,స్వంత పౌరులతో చర్చలు జరపకపోవడం బీజేపీ దుర్నితిని తెలియచేస్తుందని, ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు లను అంతం అనే పేరుతో ఖనిజాలను అడవులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చెయ్యడేమనని పర్యావరణంను కాపాడుకోవాలంటే ఆపరేషన్ కాగార్ ను ఆపాల్సిందే నని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలాని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి,వంశీ, జంబూ,లక్ష్మి,సిపిఎం నాయకులు శ్రీను,కరుణాకర్,ఎమ్ డి బాషా తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభం
హైదరాబాద్‌:ఇక ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు తెలంగాణ...
By Vadla Egonda 2025-06-11 16:05:24 0 343
BMA
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
By Citizen Rights Council 2025-05-19 09:58:04 0 756
BMA
📻 The Rise of Radio Journalism in India
📻 The Rise of Radio Journalism in India! The 1930s marked a revolutionary chapter in India's...
By Media Facts & History 2025-04-28 11:11:57 0 839
BMA
The Biggest Challenge in Indian Journalism Today: Truth Under Pressure
The Biggest Challenge in Indian Journalism Today: Truth Under Pressure In a democracy like...
By BMA (Bharat Media Association) 2025-05-16 18:54:19 0 588
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 184
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com