ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

0
7

ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

అనంత భూమి, మార్కాపురం :ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో జేసీతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని తమకు కావలసిన ఎరువులను తెచ్చుకోవచ్చునన్నారు.

వ్యాపారులు ఎవరైనా రైతులకు కావలసిన ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, వివిధ రకాల ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనివల్ల రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం, బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులు అన్నీ కూడా యాప్ ద్వారా ఆర్ఎస్‌కేలు, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇప్పటివరకు 1.17 లక్షల మంది రైతులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు.

Search
Categories
Read More
Haryana
Senior Officials Inspect Digital Infrastructure in Haryana Government Schools
On July 17, the Haryana government deployed senior civil service officers to evaluate the use of...
By Bharat Aawaz 2025-07-17 06:38:08 0 1K
Bharat Aawaz
Union Home Minister Amit Shah’s Visit to Hyderabad for “Adhikara Basha” Celebration
In a significant move to energize party workers and assert the cultural and political identity of...
By Bharat Aawaz 2025-07-09 13:25:02 0 2K
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:53:13 0 2K
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 4K
Tamilnadu
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
By Bharat Aawaz 2025-07-17 07:57:40 0 1K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com