బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు

0
147

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం.

బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం – వర్షంలో వాహనదారుల తంటాలు”  రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో గంటపాటల పాటు నిరీక్షణ.  బొల్లారం రైల్వే గేట్ వద్ద రిపేర్ పనులు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వర్షం కారణంగా సమస్య మరింత జటిలమై, రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో దాదాపు 50 నిమిషాల పాటు భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా .. వర్షంలో వందలాది మంది బైక్ రైడర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, పాదాచారులు  నిలిచిపోయారు.రైల్వే గేట్ వద్ద నిలిచిన వాహనాల క్యూలు కిలోమీటర్ ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు వర్షంలో తడుస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజలు, స్థానికులు, వాహనదారులు మాట్లాడుతూ...   ప్రతి సారి రిపేర్ పేరుతో ఇలాగే గంటల తరబడి నిలిపేస్తారు. వర్షం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నాం.ఇలాంటి పనులను ముందుగానే ప్రకటించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా రైల్వే గేట్ వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

    --Sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
Bengaluru Faces Rat-Fever Spike Amid Sanitation Crisis
Since the beginning of 2025, over 400 cases of leptospirosis (rat fever) have been reported in...
By Bharat Aawaz 2025-07-17 06:39:49 0 386
Telangana
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
By Sidhu Maroju 2025-06-05 05:10:27 0 1K
Nagaland
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
By Bharat Aawaz 2025-07-17 07:53:56 0 381
Karnataka
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage A video showing...
By BMA ADMIN 2025-05-21 08:41:26 0 1K
Telangana
రాచకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను ఎస్ఓటి, ఎల్బీనగర్ జోన్ మరియు హయత్ నగర్, పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
  నిందితుల దగ్గర నుండి 166 కిలోల నిషిద్ధ గంజాయిని మరియు .50,00,000/- (రూపాయలు యాభై లక్షల...
By Sidhu Maroju 2025-06-20 16:03:52 0 809
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com