నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.

0
43

సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని సొంత బంధువులనే మోసం చేసిన ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసి వారి నుండి 5 లక్షల 50 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 6 స్టాంపులు, 11 పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డిసిపి సుధేంద్ర తెలిపారు. 30 మందిని మోసగించి 42 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సొంత కుటుంబీకులు,బంధువులకు తక్కువ ధరకే రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామని నమ్మించి నకిలీ పట్టాలను సృష్టించి మోసం చేశారు.పిక్ సార్ట్ యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారుచేసిన ముఠా సభ్యులు 11 మందికి పట్టాలను అందజేశారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అహ్మద్, అంజాద్, కౌసర్ అలీ, రాజశేఖర్ లు ఒక ముఠాగా ఏర్పడి రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని బంధువులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ధరకే రెండు పడక గదుల ఇల్లు వస్తున్నాయన్న ఆశతో వారి బంధువులతో పాటు మరికొంతమంది బండ్లగూడలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల కోసం ఒక్కొక్కరి నుండి 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. బండ్లగూడ లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపి పట్టాలను అందజేస్తామని చెప్పి వారి నుండి డబ్బులు తీసుకుని నకిలీ పట్టాలను ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారుల స్టాంపులు సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టాలను పిక్ సార్ట్ యాప్ ఉపయోగించి సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి బంధువులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా బండ్లగూడలో నిర్మించిన ఇళ్లను కూడా వారికి చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇల్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలని సృష్టించి మోసం చేసినట్లు బాధితులు గ్రహించి మంగళహాట్ బండ్లగూడ తదితర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో...
By Sidhu Maroju 2025-06-15 11:43:54 0 157
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 841
Punjab
Punjab Embarks on Historic Irrigation Project with Malwa Canal Construction
Chandigarh: In a historic initiative, the Punjab government under Chief Minister Bhagwant...
By BMA ADMIN 2025-05-20 08:30:22 0 473
Chandigarh
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation In a major...
By BMA ADMIN 2025-05-21 05:48:27 0 465
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 187
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com