Journalist
-
-
-
-
-
Class of B.A. JMC
-
-
Experience
5+ Years -
Language
Telugu
-
Currently Working For
Journalist -
Current Position
Journalist
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి లు నిర్మాణం కోసం 100% నిధులు ఇస్తామని ఎన్వోసీలు తీసుకొని జలమండలి, విద్యుత్, టౌన్ ప్లానింగ్ వివిధ శాఖలతో సమన్వయంతో ఎన్వోసీ తీసుకొని తాను ఎమ్మెల్యే అయినప్పటినుండి సంవత్సర కాలం నుండి ఆర్యుబి నిర్మాణం అనుమతి తేవాలంటే సంవత్సర కాలం సమయం పట్టిందని ఆర్ యు బి నిర్మాణాల కోసము రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో...0 Comments 0 Shares 12 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ నాయకురాలు సీ. వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైష్ణవి యాదవ్ కు అభినందనలు తెలిపారు. మిగతా నాయకులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికారంలో...
-
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈరోజు వార్డు 5 జ్యోతి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీవాసులు తమకు కనీస అవసరాలు అయిన చెత్త సేకరణ, నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం తదితర పనులను బోర్డు...
-
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పికంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైపు లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక యంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గార్లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని...0 Comments 0 Shares 19 Views 0 Reviews
-
ఐపీఎల్ -2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గెలిచి, ఐపీఎల్-2025 ఛాంపియన్స్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు
-
ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందేఖాళీ ప్లాట్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ సర్కార్. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాలని.. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్టీ చెల్లించాల్సిందేనని తెలిపిన అధికారులు రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల...0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ- నాకు ఆరోగ్య శాఖతో చాలా అనుబంధం ఉంది. దీంట్లో ఎన్ని బాధలు ఉంటాయో నేను కళ్ళారా చూశాను.ఈ శాఖ ఎంత బలపడితే, ఎంత గొప్పగా పని చేస్తే ప్రజలకి పేదరికం నుండి బయటపడే ఆస్కారం ఉంటుంది. వైద్యానికి అయ్యే వచ్చే ఖర్చు అనుకోకుండా వచ్చే ఖర్చు. తల్లి ప్రేమకు ధనిక,...0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణఅల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి
పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులుసికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ లేడిని వారసి గూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డిసిపి నరసయ్య తెలిపారు. ఆల్వాల్ మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీద విజయా అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల...0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో సమావేశమయ్యారు. అల్వాల్ BHEL కాలనీ, వెంకటాపురం, బోలారం, సఫిల్గూడ, వినాయకనగర్ తదితర ప్రాంతాలలో మంజూరైన ROB/RUBలకు తక్కువ సమయంలో భూమిపూజ ఉంటుందని చెప్పారు.0 Comments 0 Shares 207 Views 0 Reviews
-
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావుకుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పర ప్రసాద్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం...0 Comments 0 Shares 235 Views 0 Reviews
-
జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ.
జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి.
ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ...
“జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ. జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ... “జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.0 Comments 0 Shares 152 Views 0 Reviews -
మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి.
--బత్తిని గౌరీశంకర్ గౌడ్.
జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.
మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి. --బత్తిని గౌరీశంకర్ గౌడ్. జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.0 Comments 0 Shares 219 Views 56 0 Reviews -
"దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం
ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం.
పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు.
దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు."దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం. పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు. -
ప్రమాదాల నివారణ చర్యలు.
లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు.
రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు
గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి.
అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి.
అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .ప్రమాదాల నివారణ చర్యలు. లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు. రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి. అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు . -
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం.
ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి.
అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు.
డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.
తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు.
వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం. ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి. అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు. డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు. తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు. వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు.
More Stories