• విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
    రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
    ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
    "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు. "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    0 Comments 0 Shares 120 Views 11 0 Reviews
  • అహ్మద్గూడా డబుల్ బెడ్ రూమ్ వాసులు తగినన్ని బస్సులు లేక పోవటంతో వారి యొక్క వృత్తి పనుల మీద వెళ్లేవారు వారి కార్యాలయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో ఉపాధి చేసుకునే కార్యాలయాలలో వారిని వృత్తి పనుల నుంచి తీసేయడం జరుగుతుంది. సమయానికి బస్సులు రాక వస్తే ఒకటేసారి మూడు మూడు బస్సులు రెండు బస్సులు రావడం లేకపోతే ఖాళీగా సమయానికి బస్సులు అందకపోవడంతో కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు. జరుగుతున్నది. కావున టి ఎస్ ఆర్ టి సి కుషాయిగూడ డిపో మేనేజర్ గారు దయచేసి ఏవైతే కేటాయించినటువంటి రూట్లలో సమయానికి అందుబాటులో ఉండేటట్టుగా బస్సులను కేటాయించాలని లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా కూడా మీరు వినకుండా మీ అంతట మీరే మీ ఇష్టం వచ్చిన సమయానికి బస్సులను పంపించడం ప్రయాణికులు అందుబాటులో లేనప్పుడు బస్టాండ్ పంపించడం వస్తే రెండు బస్సులు ఒకేసారి మూడు బస్సులు ఒకేసారి పోతే ఒకటేసారి కాలిగా పోవడం వస్తే ఒకటే బస్సు రావడం ఆ బస్సు కిక్కిరిసి ఉండడం ఇలా చాలా బాధపడుతున్నారు. మీరు రూట్లో కేటాయించిన బస్సులను సమయానికి ఇవ్వకపోవడం వలన జరిగే పరిణామాలు మీరు చూస్తున్నారు. సమయానికి పనికి వెళ్లకపోతే పనిలో నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు వారికి ఉపాధి కరువు అవుతుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెపుతారు. మీరు చేసే పని సరిగ్గా చేయకపోగా ఇబ్బందులు గురి చేసిన వారవుతున్నారు. కాబట్టి టిఎస్ఆర్టిసి కుషాయిగూడ వారు దృష్టి సారించి ఈ సమస్యను పూర్తి చేయాలని మేము కోరుచున్నాము.
    అహ్మద్గూడా డబుల్ బెడ్ రూమ్ వాసులు తగినన్ని బస్సులు లేక పోవటంతో వారి యొక్క వృత్తి పనుల మీద వెళ్లేవారు వారి కార్యాలయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో ఉపాధి చేసుకునే కార్యాలయాలలో వారిని వృత్తి పనుల నుంచి తీసేయడం జరుగుతుంది. సమయానికి బస్సులు రాక వస్తే ఒకటేసారి మూడు మూడు బస్సులు రెండు బస్సులు రావడం లేకపోతే ఖాళీగా సమయానికి బస్సులు అందకపోవడంతో కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు. జరుగుతున్నది. కావున టి ఎస్ ఆర్ టి సి కుషాయిగూడ డిపో మేనేజర్ గారు దయచేసి ఏవైతే కేటాయించినటువంటి రూట్లలో సమయానికి అందుబాటులో ఉండేటట్టుగా బస్సులను కేటాయించాలని లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా కూడా మీరు వినకుండా మీ అంతట మీరే మీ ఇష్టం వచ్చిన సమయానికి బస్సులను పంపించడం ప్రయాణికులు అందుబాటులో లేనప్పుడు బస్టాండ్ పంపించడం వస్తే రెండు బస్సులు ఒకేసారి మూడు బస్సులు ఒకేసారి పోతే ఒకటేసారి కాలిగా పోవడం వస్తే ఒకటే బస్సు రావడం ఆ బస్సు కిక్కిరిసి ఉండడం ఇలా చాలా బాధపడుతున్నారు. మీరు రూట్లో కేటాయించిన బస్సులను సమయానికి ఇవ్వకపోవడం వలన జరిగే పరిణామాలు మీరు చూస్తున్నారు. సమయానికి పనికి వెళ్లకపోతే పనిలో నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు వారికి ఉపాధి కరువు అవుతుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెపుతారు. మీరు చేసే పని సరిగ్గా చేయకపోగా ఇబ్బందులు గురి చేసిన వారవుతున్నారు. కాబట్టి టిఎస్ఆర్టిసి కుషాయిగూడ వారు దృష్టి సారించి ఈ సమస్యను పూర్తి చేయాలని మేము కోరుచున్నాము.
    0 Comments 1 Shares 411 Views 20 0 Reviews
  • ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి.

    ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య
    మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది.

    ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది.

    ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.
    ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.
    0 Comments 1 Shares 236 Views 12 0 Reviews
  • మంగ్లీ బర్త్ డే వేడుకలో గంజాయి కలకలం

    సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న హైదరాబాద్ శివారు ఈర్లపల్లిలోని ఓ రిసార్టులో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం వినియోగంపై సమాచారంతో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఇందులో 9 మంది గంజాయి సేవించినట్లు తెలుస్తోంది. వీరిలో మంగ్లీ ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మంగ్లీతో పాటు రిసార్టు నిర్వాహకులపై కేసు నమోదైంది.
    మంగ్లీ బర్త్ డే వేడుకలో గంజాయి కలకలం సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న హైదరాబాద్ శివారు ఈర్లపల్లిలోని ఓ రిసార్టులో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం వినియోగంపై సమాచారంతో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఇందులో 9 మంది గంజాయి సేవించినట్లు తెలుస్తోంది. వీరిలో మంగ్లీ ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మంగ్లీతో పాటు రిసార్టు నిర్వాహకులపై కేసు నమోదైంది.
    0 Comments 1 Shares 432 Views 17 0 Reviews
  • *మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర*

    ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు.

    ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు.

    ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది.

    అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది.

    ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.

    ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
    *మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర* ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు. ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది. అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది. ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 1 Shares 323 Views 19 0 Reviews
  • ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    Love
    1
    0 Comments 1 Shares 1K Views 36 0 Reviews
  • మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి.
    --బత్తిని గౌరీశంకర్ గౌడ్.

    జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.
    మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణి. --బత్తిని గౌరీశంకర్ గౌడ్. జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గంటలకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.
    0 Comments 0 Shares 448 Views 66 0 Reviews
  • ప్రమాదాల నివారణ చర్యలు.
    లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు.

    రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు
    గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి.
    అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి.
    అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    ప్రమాదాల నివారణ చర్యలు. లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు. రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి. అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    Like
    1
    0 Comments 0 Shares 495 Views 0 Reviews
  • స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, సహకరించిన ఎమ్మెల్యేకు సన్మానం.

    కంటోన్మెంట్ లోని ధోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్ల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని కంటోన్మెంట్ లోని క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో పలుమార్లు సమన్వయం చేయడం వలన నిధులు సాధించుకోగలిగామని, రాష్ట్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ బోర్డు కు మధ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంవోయు కూడా కుదిరిందని ఎమ్మెల్యే తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.
    స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, సహకరించిన ఎమ్మెల్యేకు సన్మానం. కంటోన్మెంట్ లోని ధోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్ల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని కంటోన్మెంట్ లోని క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో పలుమార్లు సమన్వయం చేయడం వలన నిధులు సాధించుకోగలిగామని, రాష్ట్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ బోర్డు కు మధ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంవోయు కూడా కుదిరిందని ఎమ్మెల్యే తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.
    Like
    1
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • **కరోనా పై ఆందోళన వద్దు*

    *దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియటల్‌లో సంబంధిత నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.*
    ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్‌ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ , ఐసీఎంఆర్‌‌ ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త, డాక్టర్ సుదీప్‌ ఘోష్‌, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి సహా ఇతర నిపుణులంతా ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు.

    ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కోవిడ్‌తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ అసలు లేదని తెలిపారు.

    దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదని మంత్రికి వివరించారు.

    కోవిడ్‌పై తమ పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయని, వివిధ దేశాల్లో అప్పుడప్పుడు సైలెంట్‌గా కేసులు పెరుగుతున్నాయని, క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కోవిడ్ వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు.

    మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు.

    పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

    కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిల్స్‌ పంపించాలని, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు మంత్రికి విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

    సాంపిల్స్‌ను సీక్వెన్సింగ్ కోసం పంపించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ రవిందర్ నాయక్‌ను ఆదేశించారు.

    సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

    సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బీబీనగర్ ఎయిమ్స్‌, నిమ్స్‌ తదితర సంస్థలతో కలిసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌(SARI), ఇన్‌ఫ్లుయేంజా లైక్ ఇల్‌నెస్‌(ILI) సర్వైలెన్స్ చేయాలని సూచించారు.

    ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్, ఇతర డిపార్ట్‌మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

    ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.

    డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్‌లను పంపించి అవేర్‌‌నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.

    ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు. అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, మెడికల్ రీఏజెంట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

    ఇదే సమయంలో ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    రాష్ట్రంలో వాటర్‌‌బోర్న్‌(డయేరియా, టైఫాయిడ్...), వెక్టార్ బోర్న్‌ (డెంగీ, మలేరియా..) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు.

    వెక్టార్‌‌బోర్న్‌ డిసీజ్‌ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి సాంపిల్స్‌ను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సాంపిల్స్‌ను సేకరించి, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ తదితర ల్యాబులకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

    వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తు చేశారు.

    ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

    కోవిడ్, ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు.

    కోవిడ్ గురించి ఆందోళన అవసరం లేదని, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు.

    మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
    **కరోనా పై ఆందోళన వద్దు* *దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియటల్‌లో సంబంధిత నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.* ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్‌ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ , ఐసీఎంఆర్‌‌ ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త, డాక్టర్ సుదీప్‌ ఘోష్‌, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి సహా ఇతర నిపుణులంతా ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కోవిడ్‌తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ అసలు లేదని తెలిపారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదని మంత్రికి వివరించారు. కోవిడ్‌పై తమ పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయని, వివిధ దేశాల్లో అప్పుడప్పుడు సైలెంట్‌గా కేసులు పెరుగుతున్నాయని, క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కోవిడ్ వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిల్స్‌ పంపించాలని, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు మంత్రికి విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంపిల్స్‌ను సీక్వెన్సింగ్ కోసం పంపించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ రవిందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బీబీనగర్ ఎయిమ్స్‌, నిమ్స్‌ తదితర సంస్థలతో కలిసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌(SARI), ఇన్‌ఫ్లుయేంజా లైక్ ఇల్‌నెస్‌(ILI) సర్వైలెన్స్ చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్, ఇతర డిపార్ట్‌మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్‌లను పంపించి అవేర్‌‌నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు. అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, మెడికల్ రీఏజెంట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వాటర్‌‌బోర్న్‌(డయేరియా, టైఫాయిడ్...), వెక్టార్ బోర్న్‌ (డెంగీ, మలేరియా..) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు. వెక్టార్‌‌బోర్న్‌ డిసీజ్‌ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి సాంపిల్స్‌ను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సాంపిల్స్‌ను సేకరించి, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ తదితర ల్యాబులకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కోవిడ్, ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. కోవిడ్ గురించి ఆందోళన అవసరం లేదని, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
    Like
    1
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • డంపింగ్ యార్డ్ తొలగించండి.
    సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష.

    మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
    డంపింగ్ యార్డ్ తొలగించండి. సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష. మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
    0 Comments 0 Shares 418 Views 0 Reviews
More Results
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com