సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
"పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
"పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.