గుట్టకిందపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతి

0
183

కదిరి :ముదిగుబ్బ మండలంలోని గుట్టకిందపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రామాలయ కమిటీ సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ను ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి సమస్యపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com