ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
0 Comments 0 Shares 59 Views 27 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com