జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ.

జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి.
ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ...
“జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జై హింద్, జై భారత్ సభకు మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో భారీ ర్యాలీ. జై హింద్ జై భారత్ సభ సందర్భంగా బచుపల్లిలోని KGR కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో ప్రత్యేక ఆకర్షణగా 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆల్వాల్ “మీ సేవ” కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహాలకు నివాళులర్పిస్తూ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. ర్యాలీలో నినాదాలు, పాటలు, జాతీయ జెండాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ... “జై హింద్ జై భారత్” ఒక దేశభక్తిని ప్రాతినిధ్యం చేసే, ప్రజల హక్కుల కోసం గళమెత్తే కొత్త వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ యొక్క దిశా నిర్దేశం ప్రజల్లోకి చేరుతుందని, ప్రజల అభిప్రాయాలతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
0 Comments 0 Shares 151 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com