కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా హెచ్చరించారు. బుధవారం ఉపాధి హామీ పథకం అమలుపై స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవో, ఏపీడీలు, ఏపీవోలు, అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హాలహర్వి, కౌతాళం, హోళగుంద, గోనెగండ్ల మండలాల ఎంపీడీవో, ఏపీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డ్వామా పీడీని ఆదేశించారు.
0 Comments 0 Shares 211 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com