"దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం

ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం.

పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు.
దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు.
"దేశభక్తి-కృతజ్ఞత" కు ప్రతీకగా రూ.10 లక్షల విరాళం ఆల్వాల్ కు చెందిన సామాన్యురాలు సింగంసెట్టి అనురాధ అరుదైన సాహసం. పిల్లలున్న కుటుంబం, పింఛన్ మీద ఆధారపడి జీవించే మధ్యతరగతి మహిళ సింగంసెట్టి అనురాధ భారత వీర జవాన్ల శౌర్యానికి తనవంతు సహాయంగా ₹10 లక్షల రూపాయలను అందించింది. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్రా ఎన్క్లేవ్ కాలనీలో నివసించే అనురాధ ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రాణాలను అర్పించిన భారత సైనికుల వీరత్వాన్నీ గౌరవించారు.తాను పొదుపు చేసుకున్న సొంత నిధుల నుండి ముఖ్యమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడం అనురాధ ఔదార్యానికి దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. బుధవారం ఆమె ఈ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు బృందాధిపతి నంజుండేశ్వర, ఎన్.వి, కర్నల్ వీ. సురేష్ గౌడ్ కి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక విరాళం కాదు, మన దేశాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేస్తూ పోరాడుతున్న సైనికుల పట్ల నా మనసులోని ప్రేమను, కృతజ్ఞతను తెలియజేసే మార్గం అని తెలిపారు. భారత పౌరులుగా దేశ రక్షకుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనీ, ఈ విధమైన సేవాభావాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. బృందాధిపతి నంజుండేశ్వర విరాళాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సంఘటనలు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అనురాధ నిర్ణయం దేశ ప్రజల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశానికి ఓ సామాన్య పౌరురాలు చేసిన ఈ అసాధారణ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిలో ఈ విధమైన దేశభక్తి చిగురించాలని అధికారులు ఆశించారు.
Love
2
3 Comments 0 Shares 542 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com